నవ్‌దీప్‌ కౌర్‌కు బెయిల్‌ మంజూరు

కార్మిక హక్కుల కార్యకర్త నవ్‌దీప్‌ కౌర్‌కు పంజాబ్‌, హర్యానా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. హర్యానాలో సోనిపట్‌లోని ఒక పారిశ్రామిక యూనిట్‌ ముందు ధర్నా చేసి…ఆ సంస్థ నుండి డబ్బులు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలపై గత నెల 12న నవ్‌దీప్‌ కౌర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎట్టకేలకు ఆరు వారాల తర్వాత ఆమెకు ఉపశమనం లభించింది. ఆమెకు బెయిల్‌ మంజూరైనట్లు నవ్‌దీప్‌ కౌర్‌ న్యాయవాది అర్ష్‌దీప్‌ సింగ్‌ చీమా తెలిపారు. ఆమె బెయిల్‌ పిటిషన్‌లో, తనపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించడంతో పాటు దాడి చేశారని చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఉద్యమానికి భారీ మద్దతును కూడగడుతున్నందున తనను లక్ష్యంగా చేసుకుని ఈ అభియోగాలు మోపారని చెప్పారు.