నితిన్‌ గడ్కరీకి కరోనా

 కేంద్ర మంత్రులంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రోడ్డురవాణా, హైవే, సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమల శాఖ మంంత్రి నితిన్‌ గడ్కరీకి కోవిడ్‌-19 సోకింది. ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ‘ నిన్న ఒంట్లో నలతగా అనిపించి, డాక్టర్‌ను సంప్రదించాను. పరీక్షలు నిర్వహించగా..కోవిడ్‌-19 అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. స్వీయ నిర్బంధంలో ఉన్నా’ అని ట్వీట్‌ చేశారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రోటోకాల్‌ అనుసరించాలని, సురక్షితంగా ఉండండి అటూ మరో ట్వీట్‌ చేశారు. హోం శాఖ మంత్రి అమిత్‌షా, జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, ఆయుష్‌ శాఖ మంత్రి సిర్పద్‌ నాయక్‌, అగ్రికల్చర్‌ శాఖ సహాయక మంత్రి కైలాష్‌ చౌదరి, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కరోనా బారిన పడిన జాబితాలో ఉన్నారు.