నిమ్మగడ్డ అంశంలో స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలని ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించింది. ఎపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విషయంలో ప్రతి విషయం తమకు తెలుసని, తామే కావాలని ఈ కేసులో స్టే ఇవ్వట్లేదని ధర్మాసనం తెలిపింది. గవర్నర్‌ లేఖ పంపినా రమేష్‌కుమార్‌కు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అత్యంత దారుణం అని సిజెఐ పేర్కొన్నారు.