నేడు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

 జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పంచాయతీరాజ్‌ సంస్థలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. టీవీ, వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కరోనా నివారణలో కృషి చేస్తున్న కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ప్రధాని మాట్లాడతారు. ఈ సందర్భంగా స్వామిత్వ అనే కొత్త పథకాన్ని మోడీ ప్రారంభించనున్నారు.