ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఖరారైన పెన్మత్స సురేష్బాబుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీఫాం అందజేశారు. సురేష్బాబు వెంట మంత్రి బొత్స సత్యన్నారాయణ, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా రాజకీయవ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్పడింది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, దివంగత పెన్మత్స సాంబశివరాజు కుమారుడు సురేష్బాబును అభ్యర్థిగా దించారు.