ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి వైసిపి ప్రాధాన్యత

 రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు తొలిప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మండలంలోని కాపవరంలో మంగళవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో వారిద్దరితో పాటు జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు, మహిళా పక్షపాతి అని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లో పంట సాగు నుంచి కొనుగోలు వరకూ ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. మహిళలకు అండగా నిలిచి దిశా చట్టం తీసుకువచ్చామన్నారు. దిశా యాప్‌ ద్వారా మహిళలకు తక్షణరక్షణ కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు.