కేంద్రం ఆమోదంతో ఎపి ప్రభుత్వం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం పుష్పశ్రీవాణి మట్లాడుతూ.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు. గిరిజన హక్కులు కాపాడేందుకు ఈ కమిషన్ను తీసుకొచ్చారని తెలిపారు. జగన్కు గిరిజనులంతా రుణపడి ఉంటారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.