మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శనివారం శంకుస్థాపన చేశారు. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన చేశారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతోపాటు 25 ఆక్వాహబ్ల నిర్మాణ పనులకు కూడా సిఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రూ.15,10 కోట్లతో ఈ ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మత్స్యకారుల జీవితాలు దయనీయస్థితిలో ఉండటం పాదయాత్రలో చూశానని, సరైన సౌకర్యాలు లేక గుజరాత్ లాంటి ప్రాంతాలకు వలసపోవడం బాధాకరమని అన్నారు.