మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు ఫొటోలు తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకు హీరోయిన్లు కూడా అతీతమేం కాదు. కొంతమంది హీరోయిన్లు అయితే ఏకంగా పిల్లలు పుట్టిన తర్వాత.. పిల్లలతో కలిసి దిగిన ఫొటోలతో సోషల్మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా తెలుగులో పేరొందిన స్నేహనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలే కరోనా కాలం.. ఈ సమయంలో గర్భవతిగా ఉన్నప్పుడు బయటకు రావడం.. అంత శ్రేయస్కరం కాదు. అయితే దీనికి పూర్తిభిన్నంగా కరీనాకపూర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా బేబీబంప్తోనే అక్క కరిష్మా కపూర్తో కలిసి షూటింగ్లో పాల్గొంది. అది కూడా ఓ యాడ్ఫిల్మ్ షూటింగ్ కోసం బయటకు వచ్చినట్టు సమాచారం. ఇలా షూటింగ్లో పాల్గొన్న వీడియోను కరీనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా కరీనా కపూర్ తన బేబీ బంప్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్మీడియాలో షేర్ చేస్తున్నారు కూడా.