భారత్ లో కొత్తగా 6 ,566 కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,566 కరోనా కేసులు నమోదు కాగా, 194 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,58,333కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 67,691 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 4,531 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 86,110 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి