భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు : జగన్‌

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ఎపి సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ‘జగనన్న శాశ్వత భూ హక్కుాభూ రక్ష ‘ పథకంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ పథకానికి సంబంధించిన సమగ్ర వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈసందర్భంగా అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన డ్రోన్‌ను పరిశీలించారు.అనంతరం జగన్‌ మాట్లాడుతూ గతంలో వెబ్‌ ల్యాండ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోనే కాకుండా ఫిజికల్‌ రికార్డులను కూడా తయారు చేయాలన్నారు. ఫిజికల్‌ డాక్యుమెంట్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సీఎం ఆదేశించారు.