టాలీవుడ్లో అందమైన హీరో ఎవరంటే.. సూపర్స్టార్ మహేశ్బాబు అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. నాలుగు పదుల వయసులోనూ ఆయన అందం ఏమాత్రం తగ్గలేదంటే.. ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఆయనను మిల్కీబారు అని ముద్దుగా పిలుస్తారు. ఆయన అందానికి అభిమానులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా మనసు పారేసుకున్నారు. ఆ కోవలోకి తాజాగా నటి సాయిపల్లవి కూడా చేరారు. ‘మహేశ్బాబు ఎంత అందంగా ఉంటాడు… ఏ సమయంలోనైనా ఆయన స్కిన్ మెరిసిపోతుంటుంది. కొన్నిసార్లు మహేష్ ఫొటోలు చూసి.. లుక్స్పరంగా ఒక వ్యక్తి ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఉంటాడు? అనుకుని ఆశ్చర్యానికి లోనయ్యేదాన్ని. ముఖ్యంగా చెప్పాలంటే, చాలా వరకు నేను ఆయన ఫొటోల్ని జూమ్ ఇన్లో చూసి ఆయన ముఖంపై ఒక్క మచ్చ కూడా లేదని.. ఎంతో బాగున్నారని అనుకుంటాను’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సాయిపల్లవి ప్రస్తుతం ‘లవ్స్టోరీ’, ‘విరాటపర్వం’ సినిమాల్లోనూ నటిస్తోంది.