ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి యోగి ఆదిత్యనాధ్ ప్రమాణ స్వీకారం చేశారు.. ఆయనతో గవర్నర్ ఆనందీ బెన్ పాటిల్ ప్రమాణం చేయించారు. లక్నోలోని వాజ్ ఫేయి స్టేడియంలో శుక్రవారం సాయంత్రం భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో పాటు బిజెపి పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, 37 ఏళ్ల తర్వాత అక్కడ రికార్డు నెలకొంది. ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసి, రెండవ దఫా సిఎం పదవిని అధిరోహించిన తొలి ముఖ్యమంత్రిగా యోగి నిలిచారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు..