చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం దాదా సాహెచ్ ఫాల్కే అవార్డుకు సూపర్స్టార్ రజనీకాంత్ ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కేను ఆయనకిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటుల్లో ఒకరైన రజనీకి ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించినందుకు సంతోషంగా ఉందని, నటుడుగా, నిర్మాత, స్క్రీన్ రైటర్గా ఆయన అందించిన సహకారం విలక్షణమైందంటూ జవదేకర్ ట్వీట్ చేశారు. ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీలో ఆశాభోంస్లే, శంకర్ మహాదేవన్, నటులు మోహన్లాల్, బిశ్వజిత్, దర్శకులు సుభాష్ ఘారు ఉన్నారు. భారతీయ చిత్ర పితామహుడు దూండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరుతో ఈ అవార్డును 1969 నుండి ఇస్తున్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చేసిన సేవలకు గానూ ప్రతి ఏడాది ఈ అవార్డును ఇస్తుంటారు.