భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేత రాకేష్ తికాయత్పై నిరసనకారులు సిరాతో దాడి చేశారు. మీడియా సమావేశంలో తికాయత్ మాట్లాడుతుండగా ఈఘటన జరిగింది. వివరాల ప్రకారం.. కర్ణాటకలో ఒక రైతు నేత డబ్బులు తీసుకుంటున్నట్లు ఇటీవల స్టింగ్ ఆపరేషన్లో వెల్లడైంది. దీంతో తికాయత్కు, ఆయన అనుచరులకు వ్యతిరేకంగా కొంతకాలంగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. స్టింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడేందుకు తికాయత్ సోమవారం బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.