రాజ్యసభ నుండి వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు

ఎనిమిది మంది ఎంపిలపై సస్పెన్షన్‌ వేటును వ్యతిరేకిస్తూ.. ప్రతిపక్షాలు మంగళవారం రాజ్యసభ నుండి వాకౌట్‌ చేశాయి. అనంతరం సస్పెన్షన్‌ వేటు పడిన ఎంపిలకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టాయి. ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్‌ను రద్దు చేయడంతో పాటు మూడు కీలక డిమాండ్లను కేంద్రం ఆమోదించేవరకు రాజ్యసభ కార్యకలాపాలను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ప్రకటించారు.కాగా, సోమవారం రాజ్యసభలో సస్పెండ్‌ వేటు పడిన ఎంపిలు రాత్రి నుండి పార్లమెంట్‌ ఆవరణలోనే ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.