ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ రాజకీయ, సినీ పరిశ్రమను కూడా కలవరపరిచింది. ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు సైతం ఈ కరోనా బారినపడ్డారు. ఈ మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా సోకినట్టు ట్విట్టర్లో తెలిపారు. ” ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాను. కరోనా లక్షణాలు ఏవి లేవు. గత కొద్ది రోజులుగా నన్ను కలిసి వాళ్లు పరీక్షలు చేయించుకోండి. త్వరలోనే కోలుకొని శక్తివంతంగా మీ ముందుకు వస్తాను ” అంటూ చెర్రీ ట్వీట్ చేశాడు.