రేపటి నుంచి టెన్త్‌ నామినల్‌ రోల్స్‌

పదోతరగతి నామినల్‌ రోల్స్‌ ఈ నెల 20వ తేది నుంచి స్వీకరించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ సుబ్బారెడ్డి తెలిపారు. జూన్‌లో జరిగే పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల నామినల్‌ రోల్‌ సంబంధిత పాఠశాల లాగిన్‌ ద్వారా ఏప్రిల్‌ 5వ తేదిలోపు సమర్పించాలని గురువారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. గుర్తింపు ముగిసిన పాఠశాలల వివరాలు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్‌సైట్‌ షషష.bరవ.aజూ.స్త్రశీఙ.ఱఅ లోపొందుపరిచిన్నట్లు తెలిపారు. 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 259 ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలలకు 2019-20 విద్యాసంవత్సరంతో గుర్తింపు గడువు ముగిసిందని వెల్లడించారు. ఈ పాఠశాలల ఆన్‌లైన్‌ నామినల్‌ రోల్స్‌ స్వీకరించబోమని చెప్పారు.