లీజుదారు అజాగ్రత్త వల్లే పేలుడు

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి శనివారం జరిగిన పేలుడు ఘటనకు ముగ్గురాయి గనుల లీజుదారుని అజాగ్రత్తే కారణమని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఈ ఘటనపై వచ్చిన వివరాల ప్రకారం ప్రభుత్వానికి కడప జిల్లా కలెక్టరు ప్రాథమిక నివేదికను అందచేశారని ఆయన తెలిపారు. ఈ నివేదిక ప్రకారం లీజుదారుని అజాగ్రత్త వల్లే పేలుడు సంభవించినట్లు తెలుస్తోందనీ, ఆంధ్ర ప్రదేశ్‌ చిన్న తరహా ఖనిజ నియమావళి 1966, ఎంఎండిఆర్‌ 1957 ప్రకారం లీజుదారుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించామని ఆయన తెలిపారు.