తెలంగాణలో నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. లోటస్ పాండ్లోని తన నివాసంలోనే ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ఆమె గురువారం ఉదయం ‘ఉద్యోగ దీక్ష’ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే సాయంత్రం 5 గంటలకు సమయం ముగిసిందని, దీక్షాస్థలిని ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. దీంతో లోటస్పాండ్లోనైనా దీక్ష కొనసాగిస్తానంటూ షర్మిల తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా కాలినడకన వెళ్లారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.