లౌకికవాదులుగా చెప్పుకునే వారంతా ఏకతాటిపైకి రావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ‘అరబిందో సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై నేను నిన్న స్టాలిన్ (తమిళనాడు ముఖ్యమంత్రి)తో మాట్లాడాను. అంతకు ముందురోజు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో మాట్లాడాను’ అని సోమవారం ఒక బెంగాలీ ఛానల్కు మమత తెలిపారు. దేశంలో సమాఖ్య వ్యవస్థ ఎలా ధ్వంసం చేస్తున్నారో, రాజ్యాంగం ఎలా నాశనం చేస్తున్నారో వంటి అంశాలతో పాటు అనేక సమస్యలపై వీరితో మాట్లాడినట్లు చెప్పారు. ‘ఇది నా బాధ్యత కాదు. ఇది అందరి బాధ్యత. సెక్యులర్గా చెప్పుకునే వారందరూ ఒక్క తాటిపైకి రావాలి’ అని మమత తెలిపారు. కాంగ్రెస్తో పోరాడే అంశంపై బెనర్జీ స్పందిస్తూ ‘కాంగ్రెస్తో మనం ఎందుకు పోరాడాలి’ అని తిరిగి ప్రశ్నించారు.