శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వంద రోజుల మహిళా మార్చ్ బ్రోచర్ ను సిఎం వైఎస్ జగన్ సోమవారం విడుదల చేశారు. నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు.. వాటిపై అవగాహనతోపాటు దశలవారీ మద్యపాన నిషేధం, దిశ యాప్, ఇతర చట్టాలు, హెల్ప్ లైన్ నంబర్ల పై మార్చి 8 వరకు వంద రోజుల కార్యాచరణను ఎపి మహిళా కమిషన్ రూపొందించింది. వంద రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేజీ విద్యార్ధినులకు రక్షణ టీం లు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సులను మహిళా కమిషన్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, డిజిపి గౌతం సవాంగ్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కె.రోజా, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్.అనురాధ, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సుయజ్ పాల్గొన్నారు.