ఏపీ సీఎం వైఎస్ జగన్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఐ పోలవరం మండలం మురమళ్లలో నాలుగో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, అనంతరం మురమళ్ల వేదికపై ప్రసంగించారు. భగవంతుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, దాదాపు 1,09,000 మందికి మంచి జరిగే కార్యక్రమాన్ని ముమ్మడివరంలో చేయబోతున్నామని చెప్పారు.ఇందులో భాగంగా నాలుగో ఏడాది కూడా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో 109 కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పారు