‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ చిత్రంతో టాలీవుడ్కు పరిచయం కానున్న వర్షా విశ్వనాథ్ ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ సోదరి ప్రియావిశ్వనాథ్ కూతురు. వాణీ విశ్వనాథ్కు నట వారసురాలిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెడుతున్న వర్ష కేరళ త్రిస్సూర్లో ఇంటర్ పూర్తి చేశారు. తమిళంలో మూడు చిత్రాల్లో నటించారు. రమణ్ కథానాయకుడిగా శిరీషారెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. ఎం.రమేశ్, గోపీ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఒక సినిమా సెట్ మీద ఉండగానే మరో రెండు చిత్రాలకు సంతకం చేశారు వర్ష. రెండో చిత్రం హీరో రమణ్తో వట్టికూటి చంద్ర దర్శకత్వంలో చేయనున్నారు. సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరితో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు.