విజయ్ జోడీగా కియారా

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో లైగర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆగస్టు25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. అనంతరం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో హీరోయిన్‌ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కియారా ఇప్పుడు విజరుతో జోడీ కట్టనుంది.