పలు జిల్లాల్లో విశాఖ ఉక్కుకు మద్దతుగా నిరసనలు కొనసాగుతున్నాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కడప నగరంలో వామపక్ష నాయకులు ధర్నా చేశారు. అలాగే కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోనూ నిరసన చేపట్టారు. కృష్ణాజిల్లా నందిగామలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. సిపిఎం నాయకులు చనుమోలు సైదులు, గోపాల్, ఖాసిం, సిపిఐ నాయకులు చుండూరు సుబ్బారావు, ఛామంచి తదితరులు పాల్గొన్నారు.