వైసీపీ లో చేరిన శమంతకమణి, యామినిబాల
వైసీపీ లో చేరిన శమంతకమణి, యామినిబాల

వైసీపీ లో చేరిన శమంతకమణి, యామినిబాల

తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామినీబాల బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరిని సాదరంగా పార్టీలోకి వైఎస్‌ జగన్‌ ఆహ్వానించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ తమ అనుచరులతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారు.