సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్‌

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయనే స్వయంగా తన ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని… డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్లో ఉన్నానని ట్వీట్ చేశారు.