సెల్ఫీ పేరుతో మంత్రి గారి కడియం నొక్కేసిన దుండగులు
సెల్ఫీ పేరుతో మంత్రి గారి కడియం నొక్కేసిన దుండగులు

సెల్ఫీ పేరుతో మంత్రి గారి కడియం నొక్కేసిన దుండగులు

రాజకీయ, సినీ, క్రీడారంగాల ప్రముఖులకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉంటారు. వారు కనపడగానే చుట్టూ వందలమంది గుమిగూడతారు. ఈ అభిమానమే ఒక్కోసారి ఆ ప్రముఖులకు దిమ్మతిరిగే షాకులు ఇస్తుంది. అదిగో అలాంటి ఓ షాకే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తగిలింది. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రలో జరిగిన ఓ వివాహానికి గురువారం సాయంత్రం ఆయన హాజరయ్యారు. ఆయన రాగానే జనం చుట్టూ చేరిపోయారు. ఫొటోలు, సెల్ఫీలతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది. ఈ హడావుడి తగ్గాక చూసుకుంటే శ్రీనివాస్ గౌడ్ చేతికున్న కడియం కనిపించకుండా పోయింది. ఒక్కసారిగా షాకైన ఆయన.. వెంటనే తన రక్షణ సిబ్బంది, అనుచరులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారిపై ఆగ్రహంతో ఊగిపోయారు. తనకు అదెంతో సెంటిమెంట్ అని.. వెంటనే దాన్ని కనిపెట్టి తీసుకురావాలని.. లేదంటే సీరియస్ యాక్షన్ ఉంటుందని ఆదేశించారు. దీంతో పోలీసులు అదెక్కడుందో కనిపెట్టే పనిలో పడ్డారు.