హైదరాబాద్‌ చేరుకున్న రజనీ కాంత్‌, నయన తార

రజనీకాంత్‌, నయనతార కలిసి నటిస్తున్న ’అన్నాత్తై‘ షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు రజనీకాంత్‌, నయనతారలు ప్రత్యేక విమానంలో  హైదరాబాద్‌ చేరుకున్నారు. సోమవారం నుండి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తుండగా, మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్‌లు కూడా నటిస్తున్నారు.