కోవిడ్ వ్యాక్సిన్ను 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్ అందివ్వనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. ఉచితంగా టీకా అందించేందుకు 1.34 కోట్ల రూపాయల వ్యాక్సిన్ కొనుగోలుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. దీన్ని వీలైనంత తర్వగా కొనుగోలు చేసి.. టీకా వేయనున్నట్లు ఆయన అన్నారు. అయితే ఇది కేవలం ప్రభుత్వాసుపత్రులకు మాత్రమేనని.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లేవారు మాత్రం వ్యాక్సిన్కు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే టీకా తయారీదారులను రాష్ట్రాలకు అందించే వ్యాక్సిన్ ధరలను తగ్గించాలని కోరారు.