నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీభరత్కు బ్యాంక్ షాకిచ్చింది. రూ.124.39కోట్లు చెల్లించాలని కరూర్ వైశ్యాబ్యాంక్ నోటీసులు పంపించింది.. నోటీసులకు శ్రీభరత్ స్పందించకపోవడంతో ఏకంగా ఆస్తుల జప్తుకు సిద్ధమయ్యింది. గతంలో హైదరాబాద్ అబిడ్స్ బ్రాంచ్లో గాజువాక, భీమిలిలోని భూములు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఈ ఆస్తుల జప్తుకు కరూర్ వైశ్యా బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. గతంలో కూడా శ్రీభరత్పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. బాలయ్య చిన్నల్లుడి కుటుంబం రూ. 13 కోట్లకుపైగా బకాయి పడిందని ఆంధ్రా బ్యాంక్ ...
Read More »Monthly Archives: February 2020
వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో గద్దెల వద్ద రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకున్నారు. వారికి అధికారులు ఘనస్వాగతం పలికారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు.
Read More »జగన్ రాజమహేంద్రవరం పర్యటన రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి రాజమహేంద్రవరం పర్యటన వాయిదా పడింది. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ను సీఎం నేడు ప్రారంభించాల్సి ఉంది. అలాగే, నన్నయ విశ్వవిద్యాలయంలో దిశ వర్క్షాప్ కూడా ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల జగన్ పర్యటన రేపటికి (శనివారం) వాయిదా పడినట్టు అధికారులు తెలిపారు.
Read More »‘జాను’ రివ్యూ
శర్వానంద్ హీరోగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా హీరోయిన్ గా సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ డ్రామా చిత్రం “జాను”. తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన “96” చిత్రానికి రీమేక్ తెరకెక్కిన “జాను” చిత్రం అంతే హైప్ తో టాలీవుడ్ నుంచి విడుదలయ్యింది.మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. కథ : కథలోకి వెళ్లినట్టయితే రామ్(శర్వానంద్) ఓ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్.కొన్ని పరిస్థితుల రీత్యా ...
Read More »చంద్రబాబు పై రెచ్చిపోయిన సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు నాయుడులో మార్పు రాలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించారన్నారు. చంద్రబాబు కరుడుగట్టిన మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై లెక్కలేని తనంతో ఆయన వ్యవహార శైలి ఉంది. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబులో మార్పు రాలేదు. కేసులకు భయపడి రాత్రికి రాత్రే హైదరాబాద్ విడిచి పారిపోయి వచ్చేశారు. చంద్రబాబు తుగ్లక్గా ప్రజలే తీర్పు ఇచ్చారు. ప్రజల్లో నమ్మకం కల్పించుకుంటే ఆయనను ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? అయినా చంద్రబాబుకు ...
Read More »రైతు భరోసా కేంద్రాల లోగోను ఆవిష్కరించిన జగన్
రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల కొనుగోలు బుకింగ్ చేసుకునే వెబ్సైట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. గురువారం అమరావతిలో అగ్రి మిషన్, కొనుగోలు కేంద్రాల తీరు, రైతులకు లభిస్తున్న ధరలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల లోగోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. సమావేశంలో కొనుగోలు కేంద్రాలు మరింత సమర్థవంతంగా నడవటానికి సీఎం జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు
Read More »కరోనా లాంటి వ్యాధులను దరిచేరనివ్వని ఆహారపదార్థాలు ఇవే..!
రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. కాబట్టి రోగనిరోధక వ్యవస్థకు కావాల్సిన శక్తిని అందించడం అవసరం. అది సరిగా.. పనిచేసినప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకవేల రోగనిరోధిక శక్తి సరిగా పనిచేయకపోతే… శరీరంలోకి బాక్టీరియా, ఫంగస్, వైరస్ లు ప్రవేశించి అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. వీటన్నింటిని బయటకు పంపిస్తూ.. శరీరానికి కావాల్సిన శక్తిని అందిచడానికి వ్యాధినిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా.. స్ట్రాంగ్ గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకోసమే ...
Read More »లైటింగ్ ఇలా ఉంటే మీ ఇల్లు మెరిసిపోతుంది
అందమైన అలంకరణ వస్తువులున్నా ఇంటికి లైటింగ్ మరింత అందం ఇస్తుంది అంటారు. లైటింగ్ ఎంత బావుంటే వస్తువులు అంత అందంగా కనిపిస్తాయి . లివింగ్ రూమ్ లో లైటింగ్ ఎక్కువ అవసరం ఉండదు . చదువుకొనేది ,టివి చూసేది ఇక్కడ . గదిమూలల్లో గోడల పైన పెయింటింగ్స్ ,ఫోటోల పైన,సోఫాలు ,కూర్చునే ప్రాంతంలో చక్కగా వెలుతురు పడాలి, అలాగే బెడ్ రూమ్ లైట్స్ మూడ్ మార్చేవిగా ఉండాలి. గదిలోకి వెళ్ళగానే వేసే లైట్ తో పడకగది లోని సామాగ్రి మొత్తం కనిపించేలా ఉండాలి . ...
Read More »ఏపీ శాసనమండలి ఛైర్మన్ సంచల నిర్ణయం
మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై మండలి ఛైర్మన్ షరీఫ్ దూకుడు పెంచారు. సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేశారు. మూడు రాజధానుల బిల్లుకు సెలక్ట్ కమిటీ చైర్మన్గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారు. ఈ కమిటీ సభ్యులుగా టీడీపీ తరపున నారా లోకేష్, పీ.అశోక్బాబు, తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి.. పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు, బీజేపీ నుంచి మాధవ్.. వైఎస్సార్సీపీ నుంచి వెన్నపూస వేణుగోపాల్రెడ్డిలు ఉన్నారు. సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్గా మంత్రి బొత్స సత్యనారాయణను నియమించారు. టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్రెడ్డి, ...
Read More »వైభవంగా కోడి రామకృష్ణ చిన్న కుమార్తె వివాహం.. తరలివచ్చిన తారాలోకం
ప్రముఖ దర్శకుడు స్వర్గీయ కోడి రామకృష్ణ చిన్న కుమార్తె ప్రవల్లిక, మహేష్ల వివాహం వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి 9.36 నిమిషాలకు ప్రవల్లిక, మహేష్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్ గండిపేటలోని కన్వెషన్స్ అండ్ ఎగ్జిబిషన్స్లో ఈ వివాహ వేడుక జరిగింది. కోడి రామకృష్ణ సతీమణి కోడి పద్మ ఆహ్వానం మేరకు తెలుగు చలనచిత్ర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లికి విచ్చేసిన వారిలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, కె.రాఘవేంద్రరావు, మురళీ మోహన్, గోపీచంద్, ...
Read More »