చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం అవసరమైతే ఆమరణ దీక్షకు సిద్ధమని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని పాతబస్టాండు వద్ద మంగళవారం ఎంపీ వెంకట్రెడ్డి దీక్ష చేపట్టారు. కొడుకు కేటీఆర్ కోసం 4 మండలాలతో సిరిసిల్లను జిల్లా చేసిన సీఎం కేసీఆర్.. భౌగోళికంగా, చారిత్రకంగా అన్ని అర్హతలున్న చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఎందుకు ఏర్పాటు చేయడంలేదని నిలదీశారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడే కేసీఆర్.. ఈ ప్రాంతంపై వివక్ష చూపడం తగదన్నారు. ...
Read More »Monthly Archives: February 2020
2021 నాటికి పోలవరం పూర్తి-మంత్రి అనిల్ కుమార్ యాదవ్
పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని పోలవరం ప్రాజెక్టు అధికారులకు జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్కుమార్ యాదవ్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28న సీఎం వైఎస్ జగన్ పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయనున్న నేపథ్యంలో మంగళవారం విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్బాబు, సహాయ, పునరావాస శాఖ కమిషనర్ బాబూరావు తదితరులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ...
Read More »స్పందన కార్యక్రమం పై సీఎం జగన్ సమీక్ష
స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా జిల్లాల వారీగా ఇళ్ల స్థలాల ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే రూపంలో మనం మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఎవరి ఉసురూ తగలకూడదు. నా మాటగా చెబుతున్నా. భూ సేకరణ సమయంలో కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ...
Read More »వైసీపీ లో చేరనున్న ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి ?
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న నాయకుడు వారి చెంతకే చేరనున్నారా? 2004 నుంచి వైఎస్ కుటుంబానికి ఏకైక ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గూటికి చేరనున్నారా? తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు భారీ షాక్ తప్పదా? వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులలో టీడీపీ ఖాళీ కాబోతుందా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెబుతున్నాయి. దశాబ్దాలుగా పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని ఢీకొంటున్న ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి త్వరలోనే వైసీపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.
Read More »టీటీడీ కొత్త ఈఓ గా కర్నాటక ఐఏఎస్ అధికారి ?
టీటీడీ ప్రస్తుత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ కానున్నారా ?.త్వరలో టీటీడీ ఈఓగా కర్ణాటక ఐఏఎస్ అధికారి శ్రీ వాస్త కృష్ణ నియమించనున్నట్టు సమాచారం.అదే విధము గా తన భార్య అయినా గుంజన్ ఐఏఎస్ ని చిత్తూర్ జిల్లా కలెక్టర్ గా నియమిస్తునారా ?.తెలుగుఅధికారులను కాదని కర్ణాటక ప్రభుత్వానికి సంబంచిన ఐఏఎస్ అధికారిని నియమించటం పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం ..కానీ ఈ బదిలీ వెనుక ఏపీ సీఎం కి సంబందించిన ముఖ్య అధికారి ఉన్నట్లు అనుమానం .మరి ...
Read More »చంద్రబాబు పై ధ్వజమెత్తిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి
రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక విఫల నాయకుడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఐదేళ్ల పాలనపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. చంద్రబాబును భస్మాసురుడి పెద్దన్నగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేసే అర్హత ఆయనకు లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేస్తున్న చైతన్య యాత్రలు జనాలు లేక వెలవెల బోతున్నాయని కోటంరెడ్డి ఎద్దేవా ...
Read More »చంద్రబాబు పై మండిపడ్డ ధర్మాన ప్రసాద్ రావు
అమరావతిలో చంద్రబాబు ఆస్తుల విలువ పెంచుకోవడానికే చంద్రబాబు రాజధాని ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చంద్రబాబువి స్వార్థపూరిత రాజకీయాలని, కేవలం తన ప్రయోజనాల కోసమే ఇటువంటి దిక్కుమాలిన పోరాటం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ విడిపోయినప్పుడు ఎలా నష్టపోయామో.. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అంతకన్నా ఎక్కువ నష్టపోయామని తెలిపారు. ఆయన దోచుకున్న వాటిలో రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టుంటే ప్రాజెక్టులన్నిపూర్తయ్యేవని ఎద్దేవా చేశారు. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు వారి పార్టీని తిరస్కరించినా బాబుకు బుద్ధి ...
Read More »రాష్ట్రపతి భవన్ చేరుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్ ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్కు చేరుకున్నారు. వారికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఆయన భార్య సవితా కోవింద్, ప్రధాని మోడీ వారికి స్వాగతం పలికారు. రెండో పర్యటనలో భాగంగా ట్రంప్ ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Read More »రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. – మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ – నామినేషన్ల స్వీకరణకు మార్చి 13న తుదిగడువు – మార్చి 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన – నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 18 తుది గడువు – మార్చి 26న రాజ్యసభ ...
Read More »కాసేపట్లో సచివాలయానికి జగన్
ఏపీ సీఎం జగన్ కాసేపట్లో సచివాలయానికి రానున్నారు. స్పందన కార్యక్రమంపై జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మందడంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read More »