ఎపిలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజూ పదివేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,601 కేసులు నమోదవ్వడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,17,094కు చేరుకుంది. ఇవాళ 73 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 4,560కి చేరుకుంది. ప్రస్తుతం 96,769 మంది కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 4,15,765 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 70,993 మందికి కరోనా ...
Read More »Monthly Archives: September 2020
ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి
టాలీవుడ్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణించారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో బాత్రూమ్లోనే కుప్పకూలిపోయారు. రాయలసీమ మాండలికంతో పలు సినిమాల్లో విలనిజం పండించారు. లాక్డౌన్ విధించిన నాటి నుండి షూటింగులు నిలిచిపోవడంతో గుంటూరులోని తన నివాసంలో ఉంటున్నారు. సమరసింహా రెడ్డి , ‘జయం మనదేరా’ వంటి ఫ్యాక్షన్ సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మహేష్బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చివరిసారిగా కనింపించారు.
Read More »నటుడు విష్ణుతో గుత్తాజ్వాల ఎంగేజ్మెంట్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల తన ప్రియుడు, నటుడు విష్ణు విశాల్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ విషయాన్ని విష్ణు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జ్వాల 37వ పుట్టినరోజులనే ఎంగేజ్మెంట్ జరిగిందని ఆయన ట్వీట్ చేశారు. ఎంగేజ్మెంట్కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. తన ట్వీట్లో జ్వాలకు బర్త్డే విషెష్ చెప్పిన విష్ణు కొత్త జీవితాన్ని కలిసి ప్రారంభిద్దామని అన్నారు. ‘అందమైన భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసి కృషి చేద్దాం. మనతోపాటు ఆర్యన్, మన కుటుంబాలు, మిత్రులు అందరికీ మంచి భవిష్యత్ ఉండేలా ...
Read More »ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో వీడియో విడుదల చేశారు. తన తండ్రికి కరోనా నెగిటివ్ అని వచ్చినప్పటికీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా మెరగవ్వలేదని చరణ్ తెలిపారు. ఊపిరితిత్తుల పనితీరు మెరుగవ్వడంతో వెంటిలేటర్ తొలగిస్తామని భావించామని, అయితే ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఊపరితిత్తులలో ఇంకా ఇన్ఫెక్షన్ పూర్తిగా తొలగిపోలేదని తెలిపారు. అయితే గతం కంటే ...
Read More »21 నుంచి విద్యాలయాలకు అనుమతి
కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్లాక్-4 మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 9, 10, ఇంటర్, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. దీనికోసం తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అదే రోజునుంచి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సంబంధిత సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది.
Read More »‘లవకుశ’ నాగరాజు కన్నుమూత
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రం ‘లవకుశ’. ఈ చిత్రంలో లవుడి పాత్ర పోషించిన నటుడు నాగరాజు కన్నుమూశారు. హైదరాబాద్ గాంధీనగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక లవకుశతో పాటుగా ఆయన భక్తరామదాసు చిత్రంలోనూ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. అయన అసలు పేరు నాగేందర్రావు. సుమారుగా 300 ...
Read More »దేశంలో 42 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 42 లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం… గత 24 గంటల్లో 90,802 కొత్త కేసులు నమోదయ్యాయి. వ్యాధి సోకిన వారి సంఖ్య 90 వేలు దాటడం… వరుసగా ఇది రెండో రోజు. అదే సమయంలో, ఈ కాలంలో 1,016 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. డేటా ప్రకారం దేశంలో ఇప్పటివరకు 42,04,614 మంది కరోనా బారిన పడగా, ...
Read More »డ్రగ్స్ కేసులో హీరోయిన్ రాగిణి అరెస్ట్
మాదకద్రవ్యాల మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ హీరోయిన్ రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్టు చేశారు. బాలీవుడ్ నుంచి శాండల్వుడ్కు పాకిన డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. మాదకద్రవ్యాల మాఫియాతో చందన సీమలో పలువురు నటీనటులకు లింకులున్నాయని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే రాగిణి స్నేహితుడు రవిశంకర్ను అరెస్టుచేసిన పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు యలహంకలోని అనన్య అపార్టుమెంటులోని రాగిణి నివాసంపై దాడులు నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు సోదాలు జరిిపిన పోలీసులు పలు కీలక ...
Read More »రియా సోదరుడు, సుశాంత్ మేనేజర్ అరెస్ట్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరండాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇద్దరినీ దాదాపు 10 గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్ చేసినట్టు ఎన్సిబి అధికారులు తెలిపారు. అంతకుముందు ఉదయం షోవిక్, మిరండా నివాసాల్లో ఎన్సిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షోవిక్ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. షోవిక్ చక్రవర్తి గంజాయి, ...
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సుంకిరెడ్డి జగదీశ్వర్రెడ్డి (72) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన ఇటీవల చేరి చికిత్స పొందుతున్నారు. గుండెకు స్టంట్ వేయించుకున్న ఆయన చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించి మృతిచెందరారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో జగదీశ్వర్ రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున్లకు అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యమ సమయంలో జైలుకు ...
Read More »