విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. గీతా కుమారి బంధువులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై వెళుతున్న బస్సులను అడ్డుకొని నిరసన తెలిపారు. బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ నిరసనలో విశాఖ వాసులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు. విశాఖలో శనివారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో విద్యార్థిని చనిపోగా, ఆమె తండ్రికి గాయాలయ్యాయి. స్థానిక గాజువాక భవానీ నగర్కు చెందిన సమ్మిడి గీతా కుమారి బిఇడి లో చేరేందుకు తండ్రి వెంకట్రావుతో కలిసి బైక్పై బయలుదేరింది. ...
Read More »Monthly Archives: March 2021
నిమ్స్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో ఆమె కోవిడ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ను వేయించుకున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరు టీకా తీసుకోవాలని కోరారు. ఇటీవల కవిత భర్త అనిల్కు కరోనా పాజిటివ్గా నిర్థారణ కావడంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్లోకి వెళ్లారు.
Read More »వేదం నాగయ్య మృతి
వేదం సినిమాలో కీలక పాత్ర పోషించిన నాగయ్య కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేసిన వేదం సినిమాలో ఆయన నటన ఎంతో సహజసిద్ధంగానూ, మనసును మెలిపెట్టే విధంగానూ ఉంటుంది. ముఖ్యంగా అల్లుఅర్జున్తో హాస్పిటల్ సన్నివేశంలో, క్లైమాక్స్ సీన్లో నాగయ్య నటన కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్, మనోజ్, అనుష్కలతోపాటు నాగయ్యకి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రం తర్వాత దాదాపు 30 సినిమాలలో ఆయన నటించారు. స్పైడర్, సీమటపాకారు, నాగవల్లి, అయ్యారే, రామయ్య వస్తావయ్యా, ...
Read More »ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు విజయవంతం
నగరి ఎమ్మెల్యే రోజాకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు ఆమె భర్త సెల్వమణి తెలిపారు. రోజా కోలుకుంటున్నారని.. ఐసియు నుంచి సోమవారం ఉదయం ఆమెను వార్డుకు మార్చారని చెప్పారు. మరో రెండు వారాలపాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని, ఆమె ఆరోగ్యంపై ఆడియో టేప్ను సెల్వమణి విడుదల చేశారు. ఇదివరకే రోజాకు ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని, కానీ గతేడాది కరోనా వ్యాప్తి కారణంగా, ఆపరేషన్ను వాయిదా వేసుకున్నట్లుగా తెలిపారు. ఈ సంవత్సరం జనవరిలో ఎన్నికల కారణంగా మరోసారి ఆపరేషన్లను వాయిదా ...
Read More »ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికిన బంగ్లాదేశ్ ప్రధాని
భారత ప్రధాని నరేంద్రమోడీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఘన స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం ఎయిరిండియా విమానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హజ్రత్ షాహజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి హసీనా పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం బంగ్లాదేశ్ రక్షణ బలగాలు ప్రధాని మోడీకి గౌరవ వందనం సమర్పించాయి. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలిసి ఆయన వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
Read More »300లకు చేరువలో కోవిడ్ మరణాలు
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. 24గంటల్లో కోవిడ్ కేసులు 60 వేలకు చేరుకోగా, మరణాలు 300లకు చేరువలోఉన్నాయి. గురువారం ఒక్కరోజే 59,118 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో 257 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. అలాగే కోవిడ్ నుంచి గడచిన 24 గంటల్లో 32,987 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశం మొత్తం 1,12,64,637 రికవరీ సంఖ్యకు చేరింది. కాగా మొత్తం కేసుల సంఖ్య 1,18,46,652కు చేరుకోగా ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 4,21,066. ఇక మొత్తం ...
Read More »60 గంటల లాక్డౌన్.. ఉల్లంఘిస్తే రూ.2వేల జరిమానా
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ పలు జిల్లాల్లో లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతోంది. ఈ క్రమంలో వార్ధా జిల్లా యంత్రాంగం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం వల్ల జిల్లా యంత్రాంగం 60 గంటల పాటు లాక్డౌన్ విధించింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి 60 గంటలపాటు లాక్డౌన్ అమల్లో ఉండనుందని ఆ జిల్లా కలెక్టర్ ప్రేర్నా పేట్రియాట్ తెలిపారు. ఈ సమయంలో నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా.. దుకాణాలు, మెడికల్షాపులు ...
Read More »తెలంగాణలో మళ్లీ మూతపడనున్న థియేటర్లు…?
తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లను మళ్లీ బంద్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పంపింది. ఒకవేళ థియేటర్లు పూర్తిస్థాయిలో మూసివేత సాధ్యం కాకుంటే సగం సీట్లు (50 శాతం) మాత్రమే నింపుకునేలా నిబంధనలు విధించాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సెకండ్ వేవ్ కొనసాగుతోందని.. వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తే… మరింత ముప్పు వాటిల్లే ప్రమాదముందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా ...
Read More »కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరు
ఏపీ సీఎం జగన్ నేడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విమానాశ్రయానికి తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరిట నామకరణం చేశారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుపెడుతున్నట్టు సీఎం జగన్ ప్రకటించడంతో తన హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయిందని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై పోరాట బావుటా ఎగురవేసిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడని చిరంజీవి వెల్లడించారు.
Read More »‘ఇండియన్ కిచెన్’లో ఐశ్యర్య రాజేష్
మలయాళంలో విజయవంతమైన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ – నిమిషా సజయన్ పాత్రలో నటిస్తుండగా ఆమె భర్తగా రాహుల్ రవీంద్రన్ కనిపించనున్నారు. ‘ఈ సినిమాలో నటించడానికి ఎంతో ఆస్తకిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ట్వీటర్ వేదికగా రాహుల్ రవీంద్రన్ వెల్లడించారు. ఆర్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మసాలా పిక్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారని సమాచారం.
Read More »