ఎపి లో పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సుప్రీం సూచించిన నిబంధనల ప్రకారం.. పరిషత్ ఎన్నికలను నిర్వహించలేదని హైకోర్టు పేర్కొంది. ఈ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎపి లో ఏప్రిల్ 7 న పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గతంలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు పిటిషన్లు వేశాయి. ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, ...
Read More »Monthly Archives: May 2021
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో.. పదో తరగతి పరీక్షలను నిర్వహించడంలేదు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించారు. పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా అధికారులు ప్రకటించారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారు ఉన్నారు. రెగ్యులర్ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో ...
Read More »నటుడు పొన్నాంబళానికి చిరు సాయం
మెగాస్టార్ చిరంజీవి తన ఉదారగుణాన్ని మరోసారి చాటుకున్నారు. నటుడు పొన్నాంబళం చికిత్సకు రెండు లక్షల రూపాయలను చిరు సాయం చేశారు. గత కొన్నేళ్లుగా ‘మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నానని.. ఎవరైనా చికిత్సకు సాయం చేయండి అని’ పొన్నాంబళం అభ్యర్థిస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకన్న మెగాస్టార్.. చికిత్సకు రెండు లక్షల రూపాయలను డైరెక్ట్గా ఆయన బ్యాంక్ ఎకౌంట్కి పంపించారు. ఈ విషయాన్ని పొన్నాంబళమే స్వయంగా తెలిపారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు రెండు లక్షల రూపాయల్ని పంపిన చిరంజీవికి తానెప్పుడూ రుణపడి ఉంటాను ...
Read More »ఏపీ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్ప్లాన్కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్కు రూ.6,131 కోట్లు బడ్జెట్లో వెచ్చించారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టున్నారు. సభ ప్రారంభం ...
Read More »ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజు మాత్రమే జరుగనున్నాయి. శాసనసభ సమావేశాలు ఒక్కరోజే నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టాక సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయనున్నారు.
Read More »నిర్మాత,దర్శకుడు. యు.విశ్వేశ్వరరావు కన్నుమూత
విప్లవ భావాలతో కెరియర్ను ఆరంభించి ఎన్నో హిట్ సినిమాలను అందించిన విశ్వశాంతి విశ్వేశ్వరరావు కరోనాతో చెన్నైలో కన్నుమూశారు. కంచుకోట, నిలువుదోపిడీ, దేశోద్ధారకుడు, మార్పు, తీర్పు, హరిశ్చెంద్రుడు లాంటి హిట్ సినిమాలను నిర్మించిన విశ్వేశ్వరరావు.. నందమూరి తారక రామారావుతో 4 సూపర్ హిట్లను ఇచ్చి స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న విశ్వేశ్వరరావు వయసు 90 ఏళ్ళ పైమాటే ! మహానటుడు ఎన్టిఆర్ కు విశ్వేశ్వరరావు వియ్యంకుడు. ఎన్టిఆర్ కుమారుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణకు, విశ్వేశ్వరరావు కూతురు శాంతి భార్య. మోహనకృష్ణ, శాంతి ...
Read More »సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించిన జగన్
4 బోధనాసుపత్రుల్లో సిటీ, ఎంఆర్ఐ పరికరాలను వీడియో కాన్ఫరెన్స్ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు. నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రుల్లో సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను సిఎం జగన్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రులను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. పేదవాడికి మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 11 టీచింగ్ ఆస్పత్రులు ప్రస్తుతం ఉంటే కేవలం 7 ఆస్పత్రుల్లో మాత్రమే సీటీ, ఎంఆర్ఐ సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.
Read More »నాలుగు భాషల్లో జెట్టి
సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్ నిర్మించిన చిత్రం ‘జెట్టి’. ఇది హార్బర్ బ్యాక్ డ్రాప్లో రూపొం దించిన సినిమా అని నిర్మాత చెప్పారు. ఈ మూవీ టైటిల్ లోగోను ఇటీవల తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రం బృందం విడుదల చేసింది. ఇప్పటివరకు రాని సముద్రపు నేపథ్య చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేయబోతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.
Read More »గుజరాత్లో ఏరియల్ సర్వే చేపట్టిన మోడీ
తౌక్టే తుఫాన్కు ప్రభావితమైన గుజరాత్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే బుధవారం చేపట్టారు. తొలుత రాష్ట్రంలోని భావనగర్కు చేరుకున్న అనంతరం విమానంలో తుఫాన్ బాధిత ప్రాంతాలైన ఉణ, డయ్యు జఫ్రాబాద్, మహువలను విహంగ వీక్షణం చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీని తర్వాత అధికారులతో అహ్మదాబాద్లో మోడీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తౌక్టే తుపాన్ కారణంగా గుజరాత్లో 13 మంది మరణించిన సంగతి విదితమే.
Read More »మత్స్యకార భరోసా పథకం నిధులను విడుదల చేసిన జగన్
వైఎస్ జగన్ మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ‘మత్స్యకార భరోసా’ పథక నిధులను విడుదల చేశారు. మంగళవారం ఉదయం కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకాన్ని వరుసగా మూడో ఏడాది కూడా అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో అర్హత ఉన్నవారిని ఒక్కరిని కూడా వదలకుండా 1,19,875 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.119,87,50,000 మేర ...
Read More »