తమిళనాట మళ్లీ రాజకీయాలు వేడెక్కబోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏఐఏడీఎంకేలో నిరసన గళం విన్పిస్తోంది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పుడు మరోసారి రాజకీయాలు హాట్హాట్గా మారనున్నాయి. ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలైన జయలలిత నెచ్చెలి శశికళ అప్పుడే రాజకీయాల్లో వస్తారని ఆశించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరిగాయి. విడుదలై బెంగుళూరు నుంచి చెన్నై వస్తున్న సందర్బంగా జరిగిన ర్యాలీ హాట్ టాపిక్గా నిలిచింది. ఆమె వస్తుందని తెలియగానే ఏఐఏడీఎంకే వర్గాల్లో ...
Read More »Monthly Archives: June 2021
బీజేపీ గూటికి ఈటల
తెలంగాణ మాజీ మంత్రి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అంతేకాదు ఆయనతోపాటు మరో టిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి కూడా బిజెపిలో చేరనున్నారు. అయితే, వారు కాషాయ కండువా ఎప్పుడు కప్పుకుంటారన్నదానిపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ఈ మేరకు సోమవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read More »మాజి ఎస్వీ ప్రసాద్ కరోనాతో కన్నుమూత
ఉమ్మడి ఎపి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వి ప్రసాద్ కరోనాతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్లో నివసిస్తున్న ఎస్వి ప్రసాద్ కుటుంబం మొత్తం ఇటీవల కరోనా బారినపడింది. దీంతో ప్రసాద్ దంపతులు యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స తీసుకుంటుండగానే.. పరిస్థితి విషమించి ఎస్వి ప్రసాద్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన 1975 బ్యాచ్కు చెందిన ఐఎఎస్ అధికారి. ఎస్వి ప్రసాద్ 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని ...
Read More »సామాజిక సేవలో షకీలా
కరోనా సెకండ్ వేవ్ సమయంలో సినీ నటులు తమ వంతు సాయం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా నటి షకీలా పేదవారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటూ.. ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి ఆహారాన్ని అందిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు షకీలా. ఆహార ప్యాకెట్లు అందిస్తున్న ఫొటోలు ఆమె సోషల్ మీడియా ద్వారా పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా… ఆమె ...
Read More »