బద్వేలు ఉపెన్నికలు ఉత్కంఠ భరితంగా కొసాగుతున్నాయి . బద్వేల్ ఉపఎన్నికల్లో శనివారం ‘సాయంత్రం 5.గంటల వరకు 55.32శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 3.00గంటల వరకు 44.82శాతం ఓట్లు పోలయ్యాయి. కడప బద్వేలులో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. కాశినాయనలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అట్లూరు మండలం కామసముద్రంలో పోలింగ్ కొనసాగుతోంది. పోరుమామిళ్ల మండలంలో ఉదయం 9 గంటల వరకు 10.54 శాతం పోలింగ్ నమోదయింది. బద్వేలులో ఉదయం 9 ...
Read More »Monthly Archives: October 2021
చిన్న వయసులోనే వదిలివెళ్లడం బాధాకరం: చిరంజీవి
కన్నడ సూపర్స్టార్ పునీత్ రాజ్కుమార్ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు అర్పించారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. చిన్న వయసులోనే పునీత్ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమన్నారు. పునీత్ సోదరుడు శివరాజ్ను హత్తుకొని చిరంజీవి ఓదార్చారు. పునీత్ మరణం తీరని లోటని హీరో వెంకటేశ్ అన్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన పుష్పాంజలి ఘటించారు. వీరితో పాటు శ్రీకాంత్, అలీ కూడా పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పునీత్ మరణం తీరని లోటన్న శ్రీకాంత్.. ఆయన కటుంబసభ్యులకు దేవుడు ధైర్యాన్ని ...
Read More »ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీల: జగన్
ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీకి అంతరాయం లేని బ్యాండ్ విడ్త్తో ఇంటర్నెట్ను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.
Read More »కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ మృతి
కన్నడ కంఠీరవ రాజ్కుమార్ కుమారుడు, పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణించారు. శుక్రవారం ఉదయం స్థానిక విక్రమ్ ఆస్పత్రిలో చేర్చిన ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కర్ణాటక అంతా హై అలర్ట్ ప్రకటించారు. పునీత్ రాజ్ కుమార్ కు ప్రస్తుతం 46 ఏళ్లు. ఎంతో కెరీర్ ఉండి, ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు.
Read More »కడప బద్వేల్ ఉప ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె విజయానంద్ ఆదేశించారు. ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. ఓటర్లు మినహా బయట నుంచి వచ్చిన మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, మండలి సభ్యులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు నియోజకవర్గ పరిధిలో ఉండకుండా చూడాలని ఆదేశించారు. స్థానికంగా ఉన్న హోటల్స్, అతిథి గృహాలు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్, రెసిడెన్షియల్ ...
Read More »కోలుకుంటున్న సాయితేజ్
సాయితేజ్ యాక్సిడెంట్ అనంతరం సుదీర్ఘ కాలం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ‘సాయి తేజ్ రోజురోజుకు మెరుగవుతున్నాడు. గాయాలు మానుతున్నాయి. లేచి కూర్చుంటున్నాడు. మేజర్గా జరిగిన ప్యాక్చర్ తరపు గాయాలు కూడా తగ్గుతున్నాయి’ అంటూ సన్నిహితులు చెబుతున్నారు. ప్రమాదం పెద్దగా జరగడంతో కోమాలోకి వెళ్లిపోవడం.. కొన్ని రోజుల పాటు అదే స్థితిలో ఉండటంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందక సాయితేజ్ బాగా సన్నబడ్డాడని వార్తలు వస్తున్నాయి.
Read More »గురుకులాల ఐఐటీ ర్యాంకర్లకు జగన్ అభినందన
వారు అడవి బిడ్డలు. కొండ కోనల్లో కష్టాలే పాఠాలుగా నేర్చుకేనే వారు! వీరిలో కొందరి తల్లితండ్రులు అటవీ ఉత్పత్తులను గ్రామగ్రామాన తిరిగి అమ్ముతుంటే, మరికొందరు కూలీనాలితో రెక్కలను ముక్కలు చేసుకుంటున్నారు. ఉన్న ప్రాంతం నుండి పాఠశాలకు వెళ్లాలంటేనే 10, 15 కి.మీలు నడిచి వెళ్ళాల్సిన స్థితి. మధ్యలో ఏ వాగో వంకో పొంగితే ఆ రోజుకి అంతే! ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నత విద్య గురించి ఆలోచించడమే కష్టం. దీనికి తోడు కరోనా కష్టాలు.. అయితే, ఏం ఆ గిరి పుత్రులు మహాద్భుతాన్ని సాధించారు. ఐఐటిలో ...
Read More »ఒకేసారి నాలుగు చిత్రాల్లో నిఖిల్!
నిఖిల్ నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్పై వివిధ దశల్లో ఉన్నాయి. కరోనాకు ముందు నిఖిల్ ‘కార్తికేయ -2′ సినిమా షూటింగ్ ఆరంభించాడు. టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో ’18 పేజెస్’ మూవీకి కమిట్ అయ్యాడు. అనుపమా పరమేశ్వరన్ నాయికగా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో బన్నీ వాసు, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ ...
Read More »రెండో విడత రైతు భరోసా విడుదల చేసిన జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపావళి సంబరాలు ముందే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లు జమ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకాలకు సంబంధించి రైతులు, రైతు గ్రూపు ఖాతాల్లోకి నగదు జమ చేశారు. వ్యవసాయానికి దన్నుగా వందకు వంద ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
Read More »‘సామి సామి’ అంటూ రష్మికతో మాస్ సాంగ్ పాడించిన పుష్ప రాజ్
‘పుష్ప’ చిత్రం నుంచి ఓ మాస్ పాట విడుదల కానుంది. ముందుగా ‘సామీ సామీ’ అనే ఈ పాట ప్రోమోను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. ఈ ప్రోమో చూస్తుంటే శ్రీవల్లి, పుష్పరాజ్ మధ్య మంచి మాస్ బీట్ను ప్లాన్ చేశారనిపిస్తోంది దర్శకుడు సుకుమార్. ఈ మొత్తం పాటను 28న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలు విడుదల చేశారు. ఈ పాటను గాయని మౌనిక పాడగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ...
Read More »