హుజురాబాద్లో టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు. హుజురాబాద్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. ఈటల రాజేందర్ కోసమే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. త్వరలో ఈటలను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తారన్నారు. రేవంత్రెడ్డి చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదన్నారు. కాంగ్రెస్లో భట్టిది నడవట్లేదని.. అక్రమార్కులదే నడుస్తోందన్నారు. వివేక్ కూడా కాంగ్రెస్లోకి వెళ్తారని తెలుస్తోందని మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం ...
Read More »Monthly Archives: October 2021
25 భాషల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్
మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగు తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది సేవలు పొందారు. కరోనా సమయంలో సైతం చిరు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఎంతోమందికి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ పంపించారు. ఇప్పుడు అదే పేరు మీద చిరు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. మొత్తం 25 భాషల్లో ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ ...
Read More »దత్తపీఠంలో అమ్మవారిని దర్శించుకున్న జగన్
జగన్ విజయవాడ పటమట దత్తానగర్లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సచ్చిదానంద స్వామితో సమావేశమై, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సోమవారం శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని, పేర్ని నాని, మేయర్ బాగ్యలక్ష్మి తదితరులు సీఎం జగన్కు స్వాగతం పలికారు.
Read More »విష్ణు గెలుపు కోసం బిజెపి పనిచేసింది
మా ఎన్నికల్లో పలువురు రాజకీయ నాయకులు కూడా భాగమయ్యారని, విష్ణు గెలుపు కోసం బిజెపి పనిచేసిందని ప్రకాశ్రాజ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ తాను ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ”మా’ అసోసియేషన్లో ఎన్నో సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఎన్నికల్లో పోటీ చేశానని అన్నారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిచి ఉంటే.. తనకంటూ ఒక పవర్ ఉండేదని, అసోసియేషన్ అభివఅద్ధి కోసం నేను అనుకున్న పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయగలిగే వాడినని అన్నారు. తనను విశ్వసించి ఓటు ...
Read More »సచివాలయ ఉద్యోగులకు జగన్ గుడ్న్యూస్
విజయ దశమి రోజు సచివాలయం, హెచ్వోడీ కార్యాలయ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సెక్రటేరియట్, వివిధ శాఖలకు సంబంధించిన హెచ్వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని పునరుద్దరించారు.. ఉద్యోగుల ఉచిత వసతిని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ఏపీ సచివాలయ సంఘం.. సీఎం వైఎస్ జగన్ను కోరారు.. సచివాలయ సంఘం విజ్ఞప్తిని అంగీకరించిన సీఎం జగన్… వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉచిత వసతిని కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు ...
Read More »‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగాయి. ప్రకాశ్ రాజ్ వెర్సస్ మంచు విష్ణు రేసులో అధిక మెజారిటీ గెలుచుకున్న మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచారు. ఇటీవల సీనియర్ ఆర్టిస్టులకు ఫించను అందించే విషయంలో చర్యలు తీసుకుంటానని అధ్యక్షుడిగా ఫైల్పై తన మొదటి సంతకాన్ని పెట్టారు విష్ణు. తాజాగా మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 15 ...
Read More »అంతిమ విజయం ధర్మానిదే.. విజయదశమి శుభాకాంక్షలు
విజయానికి ప్రతీక విజయదశమి. ధర్మ సంరక్షణ పోరాటంలో అంతిమ విజయం ధర్మానిదే అనే సత్యాన్ని తెలిపే పండగ విజయదశమి. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించుకునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు. విజయదశమిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ...
Read More »‘భీమ్లా నాయక్’ సెకండ్ సింగిల్ ప్రోమో
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న యాక్షన్ మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రంలో నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, మాటలు రాశారు. ఎస్.రాధాకష్ణ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. గురువారం ఈ సినిమా నుంచి రెండో పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ”అంత ఇష్టమేందయ్యా.. అంత ఇష్టమేందయ్యా.. నీకు.. నా మీనా” అంటూ ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పూర్తి ...
Read More »స్టేజ్పై కిందపడ్డ అచ్చెన్నాయుడు
స్వాంతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న స్మారక పోస్టర్ కవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కిందపడిపోయారు. పోస్టర్ కవర్ ఆవిష్కరణకు మంత్రి ధర్మాన కృష్ణదాస్తోపాటు ఎంపి రామ్మోహన్నాయుడు , అచ్చెన్నాయుడు హాజరయ్యారు. అప్పటికే వేదికపై సోఫాలో రామ్మోహన్నాయుడు కూర్చొన్నారు. ఈ తర్వాత అచ్చెన్న కూర్చోగానే సోఫా ఒక్కసారిగా వెనక్కి ఒరిగింది. దీంతో అచ్చెన్నతోపాటు రామ్మోహన్నాయుడు కిందపడిపోయారు. వెంటనే భధ్రతా సిబ్బంది ఇరువురినీ పైకి లేపారు.
Read More »బాలయ్యను కలిశా… చిరూనీ కలుస్తా: విష్ణు
సినీ పరిశ్రమలోని పెద్దలందరినీ కలుపుకొని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అభివృద్ధికి పాటుపడతానని నటుడు, ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో విజయం సాధించిన విష్ణు… వరుసగా సినీ పెద్దలను కలిసే పనిలోపడ్డారు. ఆ క్రమంలోనే తొలుత తనకు మద్దతుగా నిలిచిన నందమూరి బాలకృష్ణను కలిశారు. తన తండ్రి మోహన్బాబుతో కలిసి గురువారం ఉదయం బాలయ్య ఇంటికి వెళ్లారు. ‘మా’ అభివృద్ధి, శాశ్వత భవన నిర్మాణం వంటి అంశాలపై బాలకృష్ణతో చర్చించారు. భేటీ అనంతరం మోహన్బాబు మీడియాతో మాట్లాడుతూ.. ...
Read More »