Monthly Archives: July 2022

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచిన ఎపి

15వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం 173 ఎమ్మెల్యేల ఓట్లు ఉండగా అన్నీ ఒకే అభ్యర్థికి వేసిన రాష్ట్రంగా ఎపి నిలిచింది. రాష్ట్రం నుండి వందకు వంద శాతం ఓట్లు ద్రౌపది ముర్ముకే పడ్డాయి. మరే రాష్ట్రంలోనూ వంద శాతం ఓట్లు ఒకే అభ్యర్థికి పడలేదు. ఎపిలో అధికార వైసిిపితో పాటు టిడిపి కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఓట్లు గంపుగుత్తగా ముర్ముకే పడ్డాయి. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నేతగా, రెండవ ...

Read More »

ప్రేక్షకులను రప్పించడానికి శ్రమపడాలి : శరత్‌ కుమార్‌

డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో ఘన విజయం సాధించిన వెబ్‌ సిరీస్‌ ‘పరంపర’ సీజన్‌ 2 వచ్చేసింది. ఈ వెటబ్‌ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సిరీస్‌ విడుదలవుతున్న సందర్భంగా నటుడు శరత్‌ కుమార్‌ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత ఇన్నాళ్లకు ఒక గ్రే షేడ్‌ ఉన్న క్యారెక్టర్‌ ఈ సిరీస్‌లో చేస్తున్నాను. ఈ పాత్ర పూర్తిగా విలన్‌తో ఉండదు. మరొకరి వల్ల ఎదిగాడనే పేరును తట్టుకోలేడు. అదొక్కటే అతని సమస్య. మొత్తానికి భిన్నమైన సమస్య. ...

Read More »

ధరలపై దద్దరిల్లిన పార్లమెంటు – ఉభయ సభల్లో నినాదాల హోరు

కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ, ద్రవ్యోల్బణం, వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచుతున్న మోడీ ప్రభుత్వ విధానాలపై పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టగా, ప్రభుత్వం ససేమిరా అనుది. దీంతో సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేయడంతో ఉభయ సభల్లోను తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఉభయ సభలు వాయిదాపడ్డాయి. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకి పార్లమెంట్‌ ఉభయ సభలు నివాళులర్పించాయి. ఎగువ సభ సమావేశం కాగానే సిపిఐ(ఎం) సభ్యులు లేచి ధరల పెరుగుదలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

టాలీవుడ్‌లో విడాకులకు సిద్ధమైన మరో జంట

 శ్రీను వైట్ల నుండి విడాకులు కావాలని రూపా వైట్ల కోర్టు మెట్లేక్కారు నీ కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఆయన ఆనందం సినిమాతో హిట్‌ కొట్టాడు.  ఢీతో కామెడీ యాంగిల్‌ను పరిచయం చేసిన ఈ దర్శకుడు… మహేష్‌బాబుతో దూకుడు తీసి బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఆస్థాయి హిట్‌ కొట్టలేదని చెప్పాలి. కెరీర్‌ మొదట్లోనే రూపను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన సినిమాల్లో రూపా స్టైలిష్ట్‌గా పనిచేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. అయితే ఇటీవల కాలంలో ఆయన ...

Read More »

బోగస్‌ బాబు.. బోగస్‌ సర్వేలు.. చంద్రబాబుపై మంత్రి రోజా విమర్శలు

మంత్రి రోజా చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు. బోగస్‌ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరు బోగస్‌ బాబుగా పిలుస్తున్నారన్నారు. పది రోజులకి ముందు సిఎం అయినా మహారాష్ట్ర సిఎంకు టాప్‌ 5 ర్యాంకు, మూడు సంవత్సరాలుగా అన్ని పథకాలను అమలు చేస్తున్న సిఎం వైఎస్‌ జగన్‌కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడంపై రోజా మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్‌కి చిన్న మెదడు చిట్లిపోయిందని, త్వరలోనే మానసిక వైకల్య కేంద్రంలో చంద్రబాబు చేర్పించాలని అన్నారు. ఓవైపు కాంగ్రెస్‌కు మద్దతిస్తూనే.. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి అభ్యర్థికి మద్దతివ్వడం ...

Read More »

సినిమాలతోపాటు బిజినెస్‌ ప్లానింగ్‌లో ప్రభాస్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సినిమాలతోపాటు, బిజినెస్‌ ప్లానింగ్‌లో కూడా బిజిగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హోటల్‌ బిజినెస్‌వైపు ఎక్కువ ఇంటస్ట్ర్‌ చూపుతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్‌ ఈ బిజినెస్‌ను మనదేశంలోనే కాకుండా.. ఇటలీ, స్పెయిన్‌, దుబారు వంటి దేశాల్లో కూడా వ్యాప్తి చేయాలనీ చూస్తున్నడట. మన తెలుగు రుచులను విదేశీయులకు రుచి చూపించాలన్న ప్రభాస్‌ కోరిక బాగానే ఉన్నా.. వైరల్‌ అవుతున్న ఈ వార్తలపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ చేతిలో ఇప్పటికే అరడజను ...

Read More »

జులై 15 నుండి అందరికీ ఉచితంగా బూస్టర్ డోసు

శవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆజాదీకా అమృత్‌ మహాత్సవ్‌’లో భాగంగా బూస్టర్ డోస్ (ప్రీకాషన్ డోస్)   పంపిణీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 18 నుండి 59 ఏళ్ల వారికి మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. 75 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Read More »

భూవివాదంలో కోర్టుకు హాజరైన హీరో దగ్గుబాటి రానా

ఫిలింనగర్‌లోని భూ వివాదం కేసులో సినీ హీరో దగ్గుబాటి రానా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. ఫిలింనగర్‌కు నటి మాధవిలతకు చెందిన రెండు వేల రెండు వందల చదరపు గజాల స్థలాన్ని సినీనిర్మాత దగ్గుబాటి సురేష్ కొనుగోలు చేశారు. లీజ్ అగ్రిమెంట్ కొనసాగుతుండగానే వెయ్యి గజలా స్థలాన్ని దగ్గుబాటి రానాకు రిజిస్ట్రేషన్ చేశారు. లీజు గడువు ఉండగానే వ్యాపారిని స్థలం నుంచి ఖాళీ చేయాలని రానా వత్తిడి చేశారు. దీంతో బాధితుడు సిటీసివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నుండి నోటీసులు ...

Read More »

వర్షాలు, వరదలపై జగన్‌ సమీక్ష

రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్‌ దిశనిర్దేశం చేశారు. జగన్‌ మాట్లాడుతూ.. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయన్నారు. జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని, ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందన్నారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్న సీఎం జగన్‌.. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ...

Read More »

సీరియల్స్‌లో ఎంట్రీ ఇస్తున్న నితిన్‌

హీరో నితిన్‌ సీరియల్స్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. హీరో అయి ఉండి.. సీరియల్స్‌లో ఎంట్రీనా అని ఆశ్చర్యపోకండి. అదంతా సినిమా ప్రమోషన్స్‌ కోసమేనట. తాజాగా నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇందులో నితిన్‌కి జోడీగా.. కృతిశెట్టి, కేథరిన్‌ ట్రెస్సా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగానే.. నితిన్‌ ఓ పాపులరర్‌ సీరియల్‌లో అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఏ సిరియల్‌లో కేమియో రోల్స్‌ చేస్తారనేదానిపై క్లారిటీ ...

Read More »