Monthly Archives: August 2022

నాగ చైతన్య కు జంటగా నేషనల్ క్రష్ రష్మిక

నాగ చైతన్య హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిన ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాట. ఈ చిత్రంలో హీరోయిన్‌ కోసం వెతుకులాట మొదలు పెట్టిన దర్శకనిర్మాతలు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, రష్మికకు డైరెక్టర్‌ పరశురామ్‌ కథ వినిపించారా? లేదా? అన్నది స్పష్టత లేదు. ఒకవేళ ఇది ఓకే అయితే నాగ చైతన్య, రష్మిక మందన్నా తొలిసారిగా జోడి కట్టిన చిత్రం ఇదే అవుతుంది. ...

Read More »

జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు

రక్షాబంధన్‌ సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి​కి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్‌ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు.

Read More »

‘మార్క్‌ ఆంటోనీ’ షూటింగ్‌లో నటుడు విశాల్‌కు గాయలు

‘మార్క్‌ ఆంటోనీ’ ఘూటింగ్‌లో కోలీవుడ్‌ నటుడు విశాల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ”మార్క్‌ ఆంటోనీ చిత్రీకరణలో విశాల్‌కు తీవ్రంగా గాయపడ్డారు. సినిమాలోని కీలక ఫైట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రథమ చికిత్స అనంతరం విశాల్‌ షూట్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు.” అని తెలిపింది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

Read More »

ఎడిటర్ క్రీడలు రెజ్లింగ్‌లో అత్యధిక పతకాలు

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు రెజ్లింగ్‌ విభాగంలో అత్యధికంగా 12 పతకాలు వచ్చాయి. ఆ తర్వాత వెయిట్‌ లిఫ్టింగ్‌లో 10 పతకాలు వచ్చాయి. 210మంది అథ్లెట్లతో భారీ బృందం ఇంగ్లండ్‌కు వెళ్తే 22 పతకాలు ఈ రెండు ఈవెంట్‌ల నుంచే వచ్చాయి. ఈ క్రీడల్లో భారత్‌ 22స్వర్ణ, 16రజత, 23కాంస్యాలతో సహా మొత్తం 61పతకాలతో నాల్గో స్థానంలో నిలిచింది. షూటింగ్‌కు ఈసారి చోటు దక్కకపోవడంతో టాప్‌-5లో నిలవడం కష్టమేనని భావించినా.. ఆ మార్క్‌కు చేరుకోగలిగాం. ఈసారి కూడా స్వర్ణ పతకాల వేటను ...

Read More »

‘ఒకే ఒక జీవితం’ సెప్టెంబర్ 9న విడుదల

నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమల అక్కినేని, శర్వానంద్, నాజర్, రీతూ వర్మ, ప్రియదర్శి పులికొండ, వెన్నెల కిషోర్, అలీ తదితర భారీ తారాగణం వుంది. చిత్రానికి సుజిత్ సారంగ్ కెమెరాను అందించగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీజిత్ సారంగ్ ఎడిటర్ గా , సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో  తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్, అమల అక్కినేని, నాజర్, రీతూ వర్మ రెండు భాషల్లోనూ తమ పాత్రలని ...

Read More »

హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ జీవితం అందరికీ ఆదర్శం : జగన్‌

త్యాగానికి, ధర్మ పరిరక్షణకు మొహర్రం ఒక ప్రతీక అని ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. మొహర్రం సందర్భంగా ముస్లింలకు సిఎం జగన్‌ ఒక సందేశాన్ని విడుదల చేశారు. మహమ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి మొహర్రం ప్రతీక అని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టనష్టాలను భరించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడిన హుస్సేన్‌ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. పవిత్రమైన ఈ మొహర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు.

Read More »

త్వరలో బిగ్‌బాస్‌ సీజన్‌- 6 ప్రారంభం

రియాల్టీ షోల్లో బిగ్ బాస్‌కు ఉండే క్రేజే వేరు. అన్నీ షోలు వేరయా.. బిగ్ బాస్ వేరయా అన్న చందంగా ప్రేక్షకాదరణ పొందింది. వివిధ రకాల మనుషులు, వ్యక్తిత్వాలు, టాస్క్‌లు ఒక్కటేమిటి అన్ని రకాలుగా బిగ్‌బాస్ షో ఆకట్టుకుంటుంది. వారి మధ్య గొడవంట, వీరి మధ్య ప్రేమంట అంటూ పక్కింటావిడ చెప్పుకునే ముచ్చట్ల మాదిరిగా ఉండే ఈ గేమ్ షో‌కు విపరీతంగా హైప్ ఉంది. తెలుగులో బిగ్‌బాస్ ఇప్పటికే బుల్లితెరపై ఐదు సీజన్లు, ఓటీటీ వేదికగా ఓ సీజన్ ప్రసారమైంది. తాజాగా ఆరో సీజన్‌కు ...

Read More »

పవన్‌ కళ్యాణ్‌కు ఏపీ మంత్రి ధర్మాన సవాల్‌

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సవాల్‌ విసిరారు. తనకు ఇప్పుడు 64 ఏళ్లని, పవన్‌ తనతో పాటు నడవగలరా? అన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని పవన్‌ గ్రహించాలని ధర్మాన సూచించారు. ”సినిమాలో బొమ్మలతో యాక్షన్‌ చేస్తారు. పవన్‌ నడుస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చేశారు. నాతో నడవమనండి.. కనీసం 3 కిలోమీటర్లు కూడా నడవలేరు. మాటలు చెప్పినంత సులభంగా ఏమీ ప్రజాజీవితం ఉండదు” అని ధర్మాన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామంలో మంత్రి ధర్మాన ‘గడపగడపకు’ ...

Read More »

‘ప్రేమిస్తున్నానంటూ ఓ వ్యక్తి ఆరేళ్లుగా వేధిస్తున్నాడు ‘ : నిత్యామేనన్‌

ప్రేమిస్తున్నానంటూ సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి తనను ఆరేళ్ల నుంచి వేధిస్తున్నాడని సినీ నటి నిత్యామేనన్‌ తెలిపారు. ఇటీవల ఓ కోలీవుడ్‌ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గన్న ఆమె తన పెళ్లి గురించి జరిగిన ప్రచారంపై తాజాగా మరోసారి స్పందించారు. ”కొన్నిరోజులుగా నా పెళ్లి గురించి నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం సంతోష్‌ వర్కీ అనే యూట్యూబర్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఆరోజు నుంచి ఈ వార్తలు వెలువడుతున్నాయి. నిజం చెప్పాలంటే, అతడు దాదాపు ఆరేళ్ల నుంచి ...

Read More »

స్పీకర్‌ తమ్మినేని కుమారుడి వివాహ వేడుకకు హాజరైన జగన్‌

 శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహా వేడుకలో వరుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, వధువు మాధురిలను సీఎం జగన్‌ ఆశీర్వదించారు.

Read More »