దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్ బారినపడి 312 మంది మృతి చెందారు. దేశంలో కరోనా వైరస్ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,215కి చేరింది. మరణాల సంఖ్య 14 వేలు దాటింది. ఇప్పటివరకు 2,48,190 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,78,014 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్