24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు
24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు

24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరింత పెరుగుతోంది. పాజిటివ్‌ కేసులు 9 లక్షలకు, మరణాలు 23 వేలకు చేరువవుతున్నాయి. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 551 మందిని కరోనా పొట్టనపెట్టుకుంది. దీంతో దేశంలో ఇప్పటిదాకా మొత్తం కేసులు 8,49,533కు, మరణాలు 22,674కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 5,34,620 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,92,258. మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో 2,46,600 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 10,116 మంది మృతి చెందారు.