ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,188 శాంపిల్స్ పరిశీలిస్తే 275మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు మీడియా బులిటెన్లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు (50), విదేశాల నుంచి (26) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 351 కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన కేసులు 5555కు (మొత్తం 5636కు) చేరాయి. మరో 55మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2559కు చేరింది.
