ఏపీ కరోనా అలర్ట్ కొత్తగా 38 పాజిటివ్, మొత్తం 572

ఏపీ కరోనా అలర్ట్: కొత్తగా 38 పాజిటివ్, మొత్తం 572..

ఏపీలో కరోనా మహమ్మారి వణికిస్తోంది.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా మరో 28 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌‌లో తెలియజేశారు. వీటిలో కర్నూలు జిల్లాలో 13, కృష్ణా జిల్లా 5, నెల్లూరు జిల్లా 6, అనంతపురం జిల్లాలో 5 గుంటూరు జిల్లా 4, చిత్తూరు జిల్లా 4, కడప జిల్లాలో ఒక్క కేసు నమోదైంది. 

రాష్ట్రంలో కేసుల్లో గుంటూరు జిల్లా 126 పాజిటివ్ కేసులతో టాప్‌లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారు. నమోదైన కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.

గుంటూరు జిల్లా -126
కర్నూలు జిల్లా -126
నెల్లూరు జిల్లా -64
కృష్ణా జిల్లా -52
ప్రకాశం జిల్లా – 42
కడప జిల్లా – 37
పశ్చిమ గోదావరి జిల్లా – 34
చిత్తూరు జిల్లా – 28
విశాఖపట్నం జిల్లా -20
తూర్పుగోదావరి జిల్లా – 17
అనంతపురం జిల్లా -26
మొత్తం కేసులు -572