ఏపీ తెలంగాణ మధ్య ఆర్టీసీ సర్వీసులు పై సోమవారం ఇరు రాష్ట్రాల మంత్రుల కీలక భేటీ

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు మంత్రులు భేటీ కానున్నారు. తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని సోమవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే విషయంలో వీరిద్దరూ ఈ సమావేశంలో చర్చించనున్నారు.మంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, అధికారులు కూడా పాల్గొన్నారు.

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెెలిసిందే. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు కొత్తగా ఒప్పందం చేసుకోవాలని, ఆ తర్వాతే బస్సులు నడపాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో బస్సు సర్వీసుల పునరుద్ధరణకు ప్రతిష్టంభన ఏర్పడింది. రేపటి సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు సఫలమైతే ఆర్టీసీ బస్సులు గతంలో మాదిరిగా నడిచే అవకాశాలు ఉన్నాయి.