ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ లేఖ విషయంలో సీఐడీకి ఫోరెన్సిక్ నివేదిక అందినట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రాసిన లేఖ ఎస్ఈసీ ఆఫీస్లో తయారు కాలేదని రిపోర్ట్లో తేలినట్లు సమాచారం. లాప్ట్యాప్, డెస్క్టాప్లను పరిశీలించి ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. అలాగే నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తి తప్పుడు సమాచారం ఇచ్చారన్న సీఐడీ చెబుతోంది. దీనికి సంబంధించి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ కేంద్రానికి రాసిన లేఖపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. సీఐడీ కూడా రంగంలోకి దిగి లేఖ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే నిమ్మగడ్డ పీఏ సాంబమూర్తిని ప్రశ్నించింది. అలాగే రమేష్కుమార్ను కూడా విచారించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడం ఆసక్తికరంగా మారింది. సీఐడీ ఈ అంశంపై ఎలా ముందుకు వెళుతుందన్నది ఉత్కంఠరేపుతోంది.