ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని సిఎం జగన్ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో నిర్వహించిన ‘దిశ’ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో ఎపి సిఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… దిశ యాప్పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన తనను కలిచివేసిందని అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని సిఎం గుర్తుచేశారు. దిశ యాప్కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని అభివర్ణించారు.