పవన్‌కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ: పేర్ని నాని

 ప్లీనరీలో కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జోరువానలో తడిసి ముద్దవుతున్నా కూడా కార్యకర్తలు ప్లీనరీలో పాల్గొన్నారన్నారు.  తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం మాదని.. చెప్పిన హామీలనే కాదు.. చెప్పనివి కూడా సీఎం జగన్‌ అమలు చేశారన్నారు.విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. విశ్వసనీయత, విలువలకు నిలువుటద్దంలా సీఎం జగన్‌ పాలన ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘పక్షానికో సారి సెలవు రోజున పవన్‌కల్యాణ్‌ ప్రజాసేవ.. పవన్‌.. షూటింగ్‌లకే కాదు.. రాజకీయాల్లోనూ ఆలస్యమే. పవన్‌ అసెంబ్లీ గేటు ముట్టుకోవటమనేది ప్రజలు నిర్ణయిస్తారు’’ అని పేర్ని నాని అన్నారు. 2024లో జగన్‌ను అధికారంలోకి తెచ్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్ని నాని స్పష్టం చేశారు.