TDP ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యేకు జగన్ సర్కార్ షాక్

ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలకు జగన్ సర్కార్ షాకిచ్చింది. ఇద్దరు నేతలకు సంబంధించిన గ్రానైట్ కంపెనీ లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు కంపెనీ లీజులు రద్దు చేసింది. క్వారీయింగ్‌లో లోపాలు ఉన్నాయని ఇద్దరు నేతల క్వారీల లీజు రద్దు చేశారట. ఎమ్మెల్యే గొట్టిపాటికి చెందిన ఐదు క్వారీలు.. సన్నిహితులకు సంబంధించిన ఆరు క్వారీల లీజు రద్దయ్యాయి.. పోతుల రామారావుకు సంబంధించిన ఒక క్వారీ లీజు రద్దైంది. అంతేకాదు గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో జరిమానాలు విధించగా.. తాజాగా లీజులే రద్దు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే లీజులు రద్దుకు సంబంధించిన నోటీసులు రాగానే హైకోర్టును ఆశ్రయించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారట.